Videos

సంచలనాల శంకర్రావు

              చేనేత శాఖా మంత్రి  శంకర్రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసాడు తన తోటి మంత్రుల పైనే ఈసారి విరుచుకపడ్డాడు. హోంమంత్రి సబితా రెడ్డి, మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ ల అవినీతికి అడ్డులేకుండా పోయిందని అన్నాడు, ఈరోజు విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ, పోలీసు పోస్టింగుల కోసం మంత్రి సబితా రెడ్డి లక్షల్లో డబ్బులు తీసుకుంటున్నారని అల్లాగే ఆమె కొడుకు మినీ హోంమినిస్టర్ లాగ వ్యవహరిస్తున్నాడని అయన ఆరోపించాడు. మరో మంత్రి మోపిదేవి కూడా అత్యంత అవినీతికి పాల్పడుతున్నాడని , ముఖ్యమంత్రి వెంటనే వారి మీద యాక్షన్ తీసుకోవాలని మంత్రి  శంకర్రావు డిమాండ్ చేసాడు.
                    ఇదిలా ఉంటే ఈ ఆరోపణలని పరిగణలోకి తీసుకున్న హైకోర్ట్ న్యాయమూర్తి సుమోటోగా కేసుని స్వీకరించి, మంత్రులు  సబితా, మోపిదేవిల మీద లోతైన విచారణ జరగాలని అయితే వీరి మీద సిబిఐ విచారణకు ఆదేశించటానికి ఎంత అవకాశం ఉందో తేల్చడానికి మరో హైకోర్ట్ బెంచ్ కి కేసును మార్చాడు. అసలే అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ కి మరో చిక్కొచ్చి పడింది. ముందు ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.
Share on Google Plus

About siddu

0 comments:

Post a Comment